SRPT: వల్లూరి ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు నేషనల్ ప్రతిభ నోబెల్ అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వల్లూరి ఫౌండేషన్ ఛైర్మన్ వల్లూరి శ్రీనివాస్ అందజేశారు.