RR: ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. స్వామి కళ్యాణ మహోత్సవంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.