ASR: అరకు నియోజకవర్గంలోని మాడగుడ గ్రామాన్ని ఈనెల 17న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టి గంగాధర్ స్వామి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఆమె మాడగుడ గ్రామానికి చేరుకుంటారన్నారు. అనంతరం గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.