AP: కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేసరపల్లి దగ్గర ఓ కానిస్టేబుల్ బైక్ ఆపడానికి ప్రయత్నించగా.. బైక్ అదుపుతప్పి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్ అనే యువకుడు మృతి చెందగా.. సోదరుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు CCTVలో రికార్డు అయ్యాయి. పోలీసుల వల్లే ప్రణయ్ చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.