JGL: దుకాణ యజమానులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ కటకం రవీందర్ అన్నారు. రాయికల్ పట్టణంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.