AP: విజయనగరం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. బొండపల్లి మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ బొలేరోలో 650 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బొలేరో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని గంజాయి సీజ్ చేశారు. ఒడిశా నుంచి విజయనగరానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.