నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోర్ఖా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు మృతిచెందారు. ప్రసిద్ధ మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి పోలుసులు వెల్లడించారు.