నంద్యాల: అవుకు మెట్ట ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి గుర్తించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన ఇవాళ తెలిపారు. భూముల బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి సుమారు 3,500 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు.