TG: యాదాద్రి జిల్లా తక్కపురంలో ఓ తల్లి కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచింది. కుమార్తె క్రితిరెడ్డి(14) మృతిచెందగా, కుమారుడు అశాంత్ రెడ్డి(11)కి గాయాలయ్యాయి. పుట్టింటి నుంచి వచ్చిన నీలిమ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా భర్త నరేందర్ రెడ్డి, నీలిమ మధ్య గొడవలు ఉన్నాయి. కుటుంబ తగాదాలతో పిల్లలను నీలిమ పొడిచినట్లు తెలుస్తోంది.