TG: రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజాన్ ఇఫ్తార్ విందు ఇవాళ HYDలోని LB స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోసహా పలువురు మంత్రులు హాజరై, ముస్లింలతో కలిసి విందులో పాల్గొననున్నారు. ఈ వేడుకను పురస్కరించుకుని ప్రభుత్వం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, వేలాది మంది ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉంది.