AP: ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇవాళ ‘ఆర్గానిక్ రైతోత్సవం’ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు విక్రయాలు కూడా నిర్వహించనున్నారు. ఆర్గానిక్ ఆహార ప్రాముఖ్యతపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. పలువురు అధికారులు, రైతులు ఈ ఉత్సవానికి హాజరుకానున్నారు.