HYD: నగరం చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు(RRR) వెంట రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం డీపీఆర్ తయారీకి అవసరమైన సర్వేకు అనుమతులు మంజూరు చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ వెల్లడించారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన వెలువడింది.