TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్హౌస్లపై కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నామని డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారు వారం కింద సిమ్లా నుంచి వచ్చారని, గోవా నుంచి వచ్చాం.. అక్కడ సేవించినట్లు వారు చెప్పినట్లు తెలిపారు. రక్త నమూనాలను పరీక్ష కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తామని డీసీపీ వెల్లడించారు.