KNR: చిగురుమామిడి మండల విద్యాశాఖాధికారిగా ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎంఈవోగా ఆమె అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.