KNR: గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామ సర్పంచ్ తాడూరి కరుణశ్రీ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ మహంకాళి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వారితోపాటు వార్డు సభ్యులు ఇరుమాండ్ల ఎల్లేష్, అలువాల ప్రదీప్ ఉన్నారు.