RR: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంత్రి శ్రీధర్ బాబును కలిసి కోకాపేట పీఠంలో జరిగే ఉగాది ఆస్థానానికి ఆహ్వానించారు. శారదాపీఠం సమస్యలను తక్షణమే పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. మంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి, ఆశీస్సులు అందజేశారు.