BHPL: జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేసవి తాపం పెరుగుతున్నందున చిన్నారులు ఈత కోసం సమీపంలోని నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లే అవకాశం ఉందని SP సిరిశెట్టి సంకీర్త గౌడ్ హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని, వారిని ఒంటరిగా నీటి ప్రదేశాల వద్దకు వెళ్లనివ్వకూడదని సూచించారు.