MHBD: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గంగారం ఎస్సై రవికుమార్ మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. వేసవి తాపం పెరుగుతున్న దృష్ట్యా, చిన్నారులు ఈత కోసం సమీపంలోని నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అలాంటి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు.