ADB: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బోథ్ గ్రామ పంచాయతీని DLPO ఫణీందర్ రావు శనివారం సందర్శించారు. స్థానిక గ్రామ పంచాయతీ నర్సరీ పనులను పరిశీలించారు. అదేవిధంగా వీధి కుక్కల సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. DLPOతో MPDO రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.