SKLM: లోక్ అదాలత్తోనే సత్వర న్యాయం కలుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 11,602 కేసులు రాజీకి తగ్గట్టుగా గుర్తించామని, ఇందులో పదివేలకు పైగా కేసులు పరిష్కారం అవుతాయన్నారు. జిల్లా మొత్తం మీద 20 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు.