ప్రకాశం: బేస్తవారిపేట గ్రామపంచాయతీలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్ను వసూలు ప్రక్రియను మార్చి 20 వరకు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బేస్తవారిపేట ఎంపీడీవో రంగనాయకులు పాల్గొన్నారు.