PLD: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA ఆంజనేయులు స్పష్టం చేశారు. శనివారం వినుకొండలోని హనుమాన్ నగర్ జీరో లైన్లో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.