TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు రకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.