JGL: జగిత్యాల రూరల్ మండలం గోపాల్ రావుపేట గ్రామంలో శ్రీ శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో స్వామి వారికి పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మహోత్సవానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ వసంత హాజరై ప్రత్యేక పూజలు చేశారు.