వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. తొలిరోజు పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 7,208 మంది విద్యార్థులు హాజరు కాగా, 14 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగాయని ఆయన వెల్లడించారు.