ADB: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆశన్న శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.