WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ పకృతి వనాన్ని నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ సందర్శించారు. ప్రకృతి వనాల ద్వారా పట్టణంలోని కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాల్సిందిగా ప్రజలను కోరారు.