KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం RWS అధికారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.