NGKL: నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న మహమూదా బేగం నిజాయితీపై ప్రశంసలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్ వనపర్తి రూట్లో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు ఫోన్ మరిచిపోయి బస్సు దిగిపోయింది. ఈ విషయం గమనించిన కండక్టర్ ఫోన్ను బస్టాండ్ కంట్రోలర్ సురేష్కు అప్పగించారు. అనంతరం బాధితులకు సమాచారం అందించి ఫోన్ అందజేశారు.