NZB: ‘ప్రజా పాలన- ప్రగతి పణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్పల్లిలోని నర్సరీని ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, అవి ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.