మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో ‘ప్రజాపాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలరాజ్, గ్రామ సర్పంచ్ సునీల్ పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.