ప్రకాశం: బేస్తవారిపేటలోని బీసీ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. పలు మోటార్ సైకిళ్లు పత్రాలు లేకుండా కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.