KRNL: జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.