MDK: తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగిసినట్లు ఎంపీడీవో సతీష్ తెలిపారు. మండలంలోని 14 పంచాయతీలకు చెందిన 114 వార్డు సభ్యులు శిక్షణకు హాజరైనట్లు వివరించారు. తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ సర్టిఫికెట్లను ప్రధానం చేసినట్లు వివరించారు.