TG: అడవుల పరిరక్షణ కోసం 2026-27లో రూ.367.59 కోట్లతో రూపొందించిన ప్రణాళికకు అటవీశాఖ ఆమోదం తెలిపింది. 2026-27 వార్షిక ప్రణాళికపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు సమగ్రంగా చర్చించారు. అటవీ రక్షణ, నేల-తేమ సంరక్షణ పనులు, వన్య ప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం వంటివాటికి ఈ నిధులను వినియోగించనున్నారు.