KRNL: యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో జర్నలిజం PG కోర్సులో ఆదోనికి చెందిన మహిళ జర్నలిస్టు షేక్ తస్లీమాకు రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. విశ్వవిద్యాలయంలో మొత్తం 174 మంది గోల్డ్ మెడలిస్టులు ఉండగా.. టాప్-10 మందికి గవర్నర్ స్వయంగా మెడల్స్ అందజేశారు.