BHPL: పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు డెడ్లైన్ పెట్టాలని, గడువు ముగిసినా పూర్తి కాకపోతే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని IT మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.