AKP: జిల్లాలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వికాస్ కింద 2,42,536 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.134.27 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి పట్టణం గుండాలలో శుక్రవారం అన్నదాత సుఖీభవ పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ.. రైతు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు అభివృద్ధిలోకి రావాలన్నారు.