KMM: ఆధునిక పద్ధతుల్లో ఔషధ మొక్కలు పండిస్తే మంచి లాభాలు పొందవచ్చని డీఎఫ్ఎ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఔషధ మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించే శిక్షణా కార్యక్రమాన్ని వారు నేడు ప్రారంభించారు. ‘గ్రీన్ గోల్డ్’గా పిలిచే ఈ మొక్కల సాగుతో రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తమ శాఖ తరఫున సహకారం ఉంటుందని రైతులకు వివరించారు.