KRNL: నగర పరిధిలో గుంతల రహిత రహదారులే ప్రభుత్వ లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఇవాళ కృష్ణనగర్ గుత్తి పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో జరుగుతున్న గుంతల పూడ్చివేత పనులను పరిశీలించారు. గుంతలను గుర్తించి వేగంగా పూడ్చివేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగర పరిధిలో రూ.87 లక్షల వ్యయంతో మొత్తం 487 గుంతలను పూడ్చివేస్తున్నట్లు తెలిపారు.