SRD: రాయికోడ్ మండలం ఔరంగ నగర్ లో బొంగుండేశ్వర విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు విట్టల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు పైతర సాయికుమార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. తన అద్భుత శక్తులతో మానవుల సమస్యలను పరిష్కరించి, గొప్ప వ్యక్తిగా మారిన వారిలో బొంగుండేశ్వర స్వామి ఒకరని కొనియాడారు.