VZM: కొత్తవలస ప్రియదర్శిని గ్యాస్ ఏజెన్సీని తహసీల్దార్ రమాలక్ష్మి, పౌర సరఫరాల అధికారితో కలిసి శుక్రవారం తనిఖీలు చేశారు. గ్యాస్ పై వస్తున్న వదంతులు నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎటువంటి గ్యాస్ కొరత లేదని చెప్పారు. వినియోగదారులు ఆందోళన చెందన అవసరం లేదన్నారు. ఓటీపి ప్రకారం సిలిండర్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.