KRNL: ఎమ్మిగనూరు వెంకటాపురం రోడ్డులో బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గార్మెంట్ యూనిట్ను శుక్రవారం మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యూనిట్ లక్ష్యమని రేణుక తెలిపారు. స్థానిక మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని ఆమె వివరించారు.