E.G: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని రాజీమార్గంలో కేసులను పరిష్కరించు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు.