KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మధిర మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత- రామనాథం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మధిర పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల మంజూరుపై డిప్యూటీ సీఎంతో చర్చించారు.