భోజనం తర్వాత సోంపు తినడం కేవలం నోటి తాజాదనం కోసమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనిలోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి, ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు.