ప్రకాశం: ఎర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల గురించి అర్జీదారుల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు పాల్గొన్నారు.