AP: వేర్వేరు ప్రమాద ఘటనల్లో సీమకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు హైవే గోడ్డావుల కోట వల్ల బొలేరో వాహనాన్ని కారు ఢీకొనగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అటు కర్ణాటక బళ్లారి సమీపంలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు-కారు ఢీకొనగా.. కర్నూలు జిల్లా అదోనికి చెందిన అనురాగ్-ఐశ్వర్య దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.