AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో కల్తీ పాలు తాగి మరణించివారి సంఖ్య 15కు చేరింది. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.