MNCL: మందమర్రి మండలం పొన్నారం సర్పంచ్ మధు కాంగ్రెస్లో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ.. BRS విధానాలు నచ్చకనే మధు కాంగ్రెస్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.